Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
శ్రీకృష్ణ జ్యుయలరీస్, దానికి చెందిన ఇతర కంపెనీల బ్యాంక్ అకౌంట్లను స్తంభింపజేయటంపై ఈడీకి హైకోర్టు నోటీసులను జారీ చేసింది. అకౌంట్ల నిలిపివేయటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రిట్ను హైకోర్టు మంగళవారం విచారించింది. బ్యాంక్ అకౌంట్లను ఎందుకు స్తంభింపచేశారో చెప్పాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను జస్టిస్ విజరుసేన్రెడ్డి ఆదేశించారు. 2019లో ఈడీ సోదాలు చేసిన తర్వాత రూ.50 కోట్లను సీజ్ చేసిందనీ, కస్టమ్ కమిషనర్ దగ్గర కేసు పెండింగ్లో ఉండగా పిటిషనర్ల బ్యాంకు అకౌంట్లను స్తంభింపజేయడం అన్యాయమని న్యాయవాదులు వాదించారు. ఈడీకి నోటీసు ఇచ్చిన హైకోర్టు విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.