Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వీణవంక
ఓట్ల కోసం నోట్లు కొందమందికే ఇస్తు న్నారని, తమకెందుకు ఇవ్వడం లేదంటూ గురువారం గ్రామాల్లో కొందరు రోడ్డెక్కారు. బహిరం గంగా విమర్శలు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ మండలం రంగా పూర్, పెద్ద పాపయ్యపల్లి, వీణవంక మండలం గంగారంలో పలు వార్డులకు చెందిన మహిళలు ఆందోళనకు దిగారు. ఓ పార్టీకి చెందిన నేతలు ఓటుకు రూ.6000 చొప్పున కొందరికే పంపిణీ చేశారని, తమకూ ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడి పంపించారు.