Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీలోని నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు !
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆగేయ బంగాళాఖాతంలోని శ్రీలంక-తమిళనాడు తీరంలో అల్పపీడనం కొనసాగుతున్నదనీ, దానికి అనుబంధంగా సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. దీని ప్రభావం వల్ల మన రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజులు ఒకటెండ్రు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో మోస్తరు వానలు పడొచ్చని తెలిపారు. ఈశాన్య దిశ నుంచి తెలంగాణ మీదుగా కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని పేర్కొన్నారు.