Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా 174మందికి కరోనా సోకగా, ఆ వ్యాధి నుంచి 202 మంది మాత్రమే కోలుకున్నారు. ఇద్దరు మరణించారు. గురువారంసాయంత్రం 5.30 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 5.30 గంటల వరకు 38,442 మందికి టెస్టులు చేసినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. ప్రభుత్వాస్పత్రుల్లో 38,04 4 మందికి, ప్రయివేటు ఆస్పత్రుల్లో 4,398 మందికి పరీక్షలు నిర్వహించారు. మరో 2,005 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,096 యాక్టివ్ కేసులు న్నాయి. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 65 మందికి కరోనా సోకింది. అతి తక్కువగా మూడు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఈ వ్యాధి బారిన పడ్డారు. మరో ఏడు జిల్లాల్లో ఒక్క కేసు నమోదు కాలేదు.