Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాసంఘాల సహకారం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీఐటీయూ జనరల్ కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేసేందుకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని ప్రజా సంఘాలు తెలిపాయి. నవంబర్ 16, 17, 18 తేదీల్లో హైదరాబాద్లో సీఐటీయూ జనరల్ కౌన్సిల్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో శనివారం ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ప్రజా సంఘాల సమావేశం జరిగింది. నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేసి, పలు కమిటీల బాధ్యతలను ప్రజా సంఘాల నాయకత్వానికి అప్పజెప్పారు. ఈ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు, ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి జె.వెంకటేష్, యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి, పట్నం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.జి.నర్సింహారావు, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్.అరుణజ్యోతి, ఐలు రాష్ట్ర కార్యదర్శి కె.పార్థసారథి, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్.రమ, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.కోటంరాజు, కోశాధికారి వంగూరు రాములు, రాష్ట్ర కమిటీ సభ్యులు కూరపాటి రమేష్, పి.శ్రీకాంత్, వై.సోమన్న, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్.ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.