Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జెఎన్టీయూహెచ్ పరిధిలో నవంబర్ ఒకటి నుంచి బయోమెట్రిక్ హాజరు అమల్లోకి వస్తుందని టీఎస్ టీసీఈఏ రాష్ట్ర అధ్యక్షులు అయినేని సంతోష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కళాశాలల్లో అధ్యాపకులకు, పీజీ విద్యార్థులకు బయోమెట్రిక్ అటెండెన్స్ అమలు చేయాలనీ, ప్రతి ఒక్కరూ ఉదయం, సాయంత్రం రెండు పూటల వేయాలంటూ ఆదేశాలు జారీ చేయడం పట్ల అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఒక వేళ అమలు చేయకపోతే రూ.20 వేలు ఫైన్ కట్టాలనీ, వీలైతే కళాశాల సస్పెన్షన్/ అఫిలియేషన్ రద్దు చేస్తాం అని కూడా ఆదేశాల్లో ఉందని గుర్తుచేశారు. మొత్తానికి బయోమెట్రిక్ అమలు విషయంలో కచ్చితమైన ఆదేశాలొచ్చాయని చెప్పారు. ఆ ఆదేశాలను అమలు జరిగేలా చూడాలనీ, చేయని కళాశాలలపై పక్షంలో చర్యలు తీసుకోవాలని కోరారు.