Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైఎస్ఆర్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల
- రంగారెడ్డి జిల్లా మంచాలలో ప్రజాప్రస్థాన పాదయాత్ర
నవతెలంగాణ-మంచాల
గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి, తన ఇంట్లో మాత్రమే ఐదు ఉద్యోగాలు ఇచ్చుకున్నారని, సీఎం కేసీఆర్ ఉద్యోగం తీసేస్తేనే రాష్ట్రంలో అందరికీ ఉద్యోగాలు వస్తాయని వైఎస్ఆర్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆమె చేపట్టిన ప్రజా ప్రస్థాన పాదయాత్ర శనివారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని జపాల్, రంగాపూర్, చీదేడ్ గ్రామాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. గతంలో ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ అమలు చేయలేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ చేయడం లేదన్నారు. మంచాల మండలంలోని లింగంపల్లి గేటు వద్ద 96 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం అయ్యాయని, కానీ మండలంలోని 23 గ్రామాల్లో ఎవరికి ఇస్తారో అర్థం కావడం లేదని అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను ఇష్టానుసారంగం తొలగించడం సరికాదన్నారు. సీఎం కేసీఆర్కు ఫీల్ అసిస్టెంట్ల ఉసురు తగులుతుందన్నారు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. తమకు అవకాశం ఇస్తే మళ్లీ రాజన్న రాజ్యం తీసుకొస్తామని చెప్పారు.