Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కేటీఆర్ బృందం ఆహ్వానం
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫ్రెంచ్ కంపెనీలను ఆహ్వానిస్తున్నట్టు మంత్రి కే తారకరామారావు తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు ప్రభుత్వం తరఫున ఇచ్చే రాయితీలనూ ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. మంత్రి కేటీఆర్తో పాటు ప్రతినిధిబృందం ఫ్రాన్స్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు కార్పొరేట్ సంస్థల సీఈఓలతో ఆయన సమావేశాలు నిర్వహించారు. సర్వియర్ అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్ సంస్థ యాజమాన్య బందంతోపాటు పలు కంపెనీలతో ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. 4.7 బిలియన్ యూరోల ఆదాయంతో, ఫ్రాన్స్లో రెండవ అతిపెద్ద ఫార్మాస్యూటికల్ గ్రూప్గా ఉన్న సర్వియర్ సంస్థ 150 దేశాల్లో తమ కార్యకలాపాలు సాగిస్తోందని ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. 2022 బయో ఏషియా సదస్సు లో పాల్గొనాలని వారికి ఆహ్వానం పలికారు.