Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 52 కిలోల గంజాయి స్వాధీనం
- వివరాలు వెల్లడించిన రైల్వే డీఎస్పీ చంద్రభాను
నవతెలంగాణ-కంటోన్మెంట్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శనివారం 52 కిలోల గంజాయి పట్టుబడింది. విశాఖ ఏజెన్సీ నుంచి ముంబయి, ఒరిషా ప్రాంతాలకు తరలిస్తుండగా నిందితులు రైల్వే పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. రైల్వే డీఎస్పీ చంద్రభాను శనివారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఒరిషా, మహారాష్ట్రలోని ముంబుయి, వివిధ ప్రాంతాలకు చెందిన ప్రేమ్ చంద్, మాలిక్, సుబాన్, మస్తాన్, నీరా మాలిక్, రాజు మాలిక్, అఖయ మాలిక్ కొంత కాలంగా గంజాయి వ్యాపారం చేస్తున్నారు. ప్రధానంగా ఒరిషా, ముంబయిలో యువతే టార్గెట్గా గంజాయిని విక్రయిస్తున్నారు. శనివారం విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి బస్తాల్లో ప్యాక్ చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు తీసుకొచ్చిన గంజాయిని కోణార్క్ ఎక్స్ప్రెస్ ద్వారా తరలిస్తుండగా రైల్వే పోలీసులు పట్టుకున్నారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.