Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయాణీకులకు ఆర్టీసీ ఎమ్డీ విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
టీఎస్ఆర్టీసీ అభివృద్ధికి ప్రయాణీకులు సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆసంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. శనివారంనాడాయన టీఎస్ఆర్టీసీకి చెందిన పుష్పక్ బస్సులో శంషాబాద్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పంజాగుట్ట వరకు ప్రయాణం చేశారు. కండక్టర్ నుంచి టిక్కెట్ కొనుగోలు చేసి, బస్సులోని తోటి ప్రయాణీకులతో మాట్లాడారు. విమానాశ్రయం నుంచి బస్సులో వస్తున్న తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్రకు చెందిన ప్రయాణీకులతో ఆయా రాష్ట్రాల్లోని ప్రజారవాణా గురించి వాకబు చేశారు. ఎలాంటి బస్సులు, ప్రయాణాలు, సౌకర్యాలను ఇష్టపడతారంటూ సలహాలు, సూచనలు స్వీకరించారు.
నిమ్స్లో డ్రైవర్కు పరామర్శ
బస్సు నడిపే సమయంలో అనారోగ్యానికి గురై, ఎలాంటి ప్రమాదం జరక్కుండా, ప్రయాణీకులు, రోడ్డుపై ప్రజల ప్రాణాలను కాపాడిన ఆర్టీసీ డ్రైవర్ అంజయ్యను ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ నిమ్స్ ఆస్పత్రిలో పరామర్శించారు. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ను కలిసి డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మరింత మెరుగైన వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు. విధినిర్వహణలో సమయస్ఫూర్తితో వ్యవహరించి, పెను ప్రమాదాన్ని నివారించిన ఆర్టీసీ డ్రైవర్ అంజయ్య సేవల్ని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. అంజయ్య కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. వైద్యుడు ఒకరి ప్రాణాలు మాత్రమే కాపాడగలడనీ, డ్రైవర్ అనేకమంది ప్రాణాలకు కాపాడే శక్తి ఉన్నవాడంటూ ఈ సందర్భంగా సజ్జనార్ వ్యాఖ్యానించారు.