Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హుజూరాబాద్లో పోలింగ్ తర్వాత వీవీ ప్యాట్లను వేరే వాహనంలోకి తరలించడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్కు ఫిర్యాదు చేసింది. హుజూరాబాద్ ఎన్నికల నిర్వ హణలో జరిగిన అక్రమాలపైనా, అధికార దుర్వినియోగంపైనా సీబీఐ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ఈసీని కలిసిన వారి లో బీజేపీ ఎల్పీ నేత రాజాసింగ్, నేతలు డీకే అరుణ, ఎన్ రామచందర్ రావు, తదితరులున్నారు. వీవీ ప్యాట్ల తరలింపు ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కౌంటింగ్ సమయంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.