Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థ, గ్రామీణాభివృద్ధిపై చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేకంగా రూపొందించిన యోజన నవంబర్ ప్రత్యేక సంచికను ఆదివారం హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వస్తున్న ప్రభుత్వ అధికారిక పత్రిక యోజనలో రాష్ట్రంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పథకాలు, గంగదేవిపల్లి, ఇబ్రహీంపూర్, అంకాపూర్, తదితర గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక వ్యాసాలు రాయడం గర్వకారణంగా ఉందన్నారు.