Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం నెక్లెస్రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకు ముందు మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభారు పటేల్ జయంతి సందర్భంగా గాంధీభవన్లో ఆయన చిత్ర పటానికి పూలదండలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు జె గీతారెడ్డి, మహేష్కుమార్గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, వంశీచంద్రెడ్డి, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, సీనియర్ నేత వి. హనుమంతరావు, అనిల్కుమార్ యాదవ్, హర్కర వేణుగోపాల్, బొల్లు కిషన్, నగేష్ ముదిరాజ్, మానవతారారు, రోహిన్ రెడ్డి, మెట్టు సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.