Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు, రేపు, ఎల్లుండి ధర్నాలు : తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
యాసంగిలో వరి సాగును నిషేదించడాన్ని వ్యతిరేకిస్తూ సోమ, మంగళ, బుధవారాల్లో ఆయా కలెక్టరేట్లు, వ్యవసాయ కమిషనర్ కార్యాలయం వద్ద నిరసనలు తెలపాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ పిలుపునిచ్చారు. ఈమేరకు ఆదివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో ధాన్యం, బియ్యం నిల్వలు అదనంగా ఉన్నాయనీ, యాసంగిలో దొడ్డు రకాల వరి సాగు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశించటమేంటని ప్రశ్నించారు. దీన్ని ఆసరా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం సాగు వద్దనడం సరైందికాదని పేర్కొన్నారు. వరి కాకుండా ఇతర ప్రత్యామ్నాయ పంటలు ఏ తరహాలో వేసుకోవాలో, ఎరువుల వాడకం ఎలా ఉండాలో వ్యవసాయ యూనివర్సిటీ చూచిందని గుర్తు చేశారు. విత్తనాలు ఎక్కడ దొరుకుతాయో, వాటి ధరల పరిస్థితి ఏంటో చెప్పలేదని విమర్శించారు. వరి సాగు విషయంలో మంత్రులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని పేర్కొన్నారు. యాసంగిలో పంటలు చేయడానికి వీలుగా తగిన ప్రణాళిక రూపొందించాలని డిమాండ్ చేశారు.