Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోయినపల్లి వినోద్ కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) రాష్ట్ర శాఖ భవన నిర్మాణానకి స్థలం కోసం కోసం సీఎం కేసీఆర్ తో మాట్లాడుతానని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్ హామి ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్లోని గచ్చిబౌలి ఏ.ఐ.జీ ఆస్పత్రి ఆడిటోరియంలో జరిగిన రాష్ట్ర సదస్సులో వినోద్ కుమార్ మాట్లాడారు. ఆరోగ్య తెలంగాణ ముఖ్యమంత్రి లక్ష్యమనీ, ఆ దిశగా వైద్యులు మమేకం కావాలని కోరారు. ఐఎంఏ సావనీర్ను ఆయన ఆవిష్కరించారు. సదస్సులో ఐఎంఏ జాతీయ అధ్యక్షులు డాక్టర్ జయలాల్, రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ చైర్మెన్ డాక్టర్ రవీందర్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎం.సంపత్ రావు, పాస్ట్ ప్రెసిడెంట్ డా. లవకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.