Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాలిబూడిదైన ఆరెకరాల పంట
నవతెలంగాణ-రాజంపేట్
గుర్తుతెలియని దుండగులు మొక్కజొన్న పంటకు నిప్పు పెట్టడంతో ఆరెకరాల్లో పండించిన పంట కాలిబూడిదయింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండలం కొండాపూర్ గ్రామంలో ఆదివారం వెలుగుజూసింది. గ్రామానికి చెందిన కడెంమైసయ్య, పోతరాజు సాయిలు, రాజపేట సిద్దయ్యం ముగ్గురు కలిసి ఆరెకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారు. వీటిలో ఐదెకరాలు కౌలుకు తీసుకొని సాగు చేశారు. పంట చేతికి రాగా.. కంకులను కుప్పగా పోశారు. ఆ కుప్పలకు గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టడంతో సుమారు 150 క్వింటాళ్ల పంటమొత్తం కాలి బూడిదయింది. మూడు లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లినట్టు రైతులు వాపోయారు. కౌలు కింద ఎకరాలకు 9000 చెల్లించాల్సి ఉందని కన్నీటిపర్యంతం అయ్యారు. రైతుల ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారులు పంచనామా చేశారు. మండల వ్యవసాయాధికారి పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్టు తెలిపారు. నోటికాడికి వచ్చిన పంటకు నిప్పు పెట్టిన వారిని గుర్తించి కఠినచర్యలు తీసుకొని, తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.