Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛత్తీస్గడ్లో ఘటన
- చిరుత చర్మంతో పాటు యువకుడు అరెస్టు
నవతెలంగాణ-చర్ల
సరిహద్దు ఛత్తీస్గఢ్లోని కొండగావ్ జిల్లాలో ఫరస్గావ్ పోలీస్స్టేషన్ పరిధిలోని బడేదోంగర్ మోర్లో చిరుతపులి చర్మంతో ఉన్న సంచరిస్తున్న యువకుడిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. కొండగావ్ ఎస్పీ సిద్ధార్థ్ తివారీ విలేకర్ల సమావేశంలో ఘటన వివరాలు వెల్లడించారు. గంజాయి స్మగ్లర్ల కోసం పోలీసులు వాహనాలపై తనిఖీలు చేపడుతుండగా బైక్పై వెళ్తున్న యువకుడ్ని తనిఖీ చేయగా.. అతని వద్ద చిరుతపులి చర్మాన్ని గుర్తించిన పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. చిరుత చర్మం అక్రమ రవాణాకు పాల్పడుతున్న మరో యువకుడు పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడు. చిరుత పులి తోలు ధర దాదాపు రూ.10 లక్షల వరకు ఉంటుందని ఎస్పీ తెలిపారు.