Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
స్టేట్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ (ఎస్ఎల్టీఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా చక్రవర్తుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా కే. గౌరీశంకర్ రావు ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్లోని శ్రీకష్ణ దేవరాయాంధ్ర భాషానిలయంలో ఎస్ఎల్టీఏ రాష్ట్ర సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్బంగా 2021-23కాలానికి గానూ రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జీవో నెంబర్లు 2,3 విడుదల చేసినందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. పండితుల అప్ గ్రేడేషన్ ప్రక్రియను ప్రభుత్వ, న్యాయ పరంగా వేగవంతం చేసి న్యాయం చేయాలని కోరారు. రాష్ట్రంలో తెలుగు, హిందీ, ఉర్దూ భాషలకు గతవైభవం తేవాలనీ, సారస్వత పరిషత్, హిందీ ప్రచార సభ సంస్థలకు పునరుజ్జీవం చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎల్టీఏ నాయకులు భారతవాణి, లక్ష్మి, చంద్రమోహన్, నూరానీ, సత్యనారాయణ కాంబ్లీ, సురేంద్ర నాథ్, శ్రీదేవి, మాధవి, భారతి తదితరులు పాల్గొన్నారు.