Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలింగ్ అనంతరం గోడౌన్కు తరలిస్తుండగా సోషల్మీడియాలో వైరల్
- ఆయా పార్టీల ప్రతినిధులకు క్లారిటీ ఇచ్చిన ఎన్నికల అధికారులు
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
శనివారం అర్ధరాత్రి ఈవీఎంలు, వీవీప్యాడ్లను ఓ ప్రయివేటు వాహనంలో తలిస్తుండగా.. ఓ వ్యక్తి తీసిన వీడియో ఆదివారం వైరల్ అయింది. పోలింగ్లో ఉపయోగించిన యంత్రాలను తారుమారు చేశారంటూ సోషల్మీడియాలో వైరల్ అయింది. ఆయా పార్టీల నేతలు, ఈటల వర్గీయులు ఆందోళనకు దిగారు. ఒక్కసారిగా వైరల్ అయిన వీడియోతో సర్వత్రా తీవ్ర చర్చసాగింది. ఆదివారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, హుజూరాబాద్ ఆర్డీఓ సీహెచ్.రవీందర్రెడ్డి ఈ ఘటనపై క్లారిటీ ఇచ్చారు. పోలింగ్ ప్రక్రియకు ముందు పోలింగ్ స్టేషన్ నెంబర్ 200లో నిర్వహించిన మాక్పోలింగ్లో ఈవీఎం, వీవీ ప్యాడ్ సాంకేతిక సమస్య వచ్చి మొరాయించిందని చెప్పారు. పని చేయని ఆ యంత్రాల స్థానంలో సెక్టోరల్ అధికారి రిజర్వ్లో ఉన్న వీవీ ప్యాడ్ అందజేశారని తెలిపారు. పోలింగ్ ముగిసిన అనంతరం రాత్రి ప్రిసైడింగ్ అధికారి, సెక్టోరల్ అధికారి, పోలింగ్ సిబ్బంది, ఎస్కార్ట్ పోలీసులతో ఆర్టీసీ బస్సులో పనిచేయని ఈవీఎం, వీవీప్యాడ్ యంత్రాలతో కరీంనగర్ ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలోని గోడౌన్కు అప్పగించారని అన్నారు. వాటిని తీసుకొస్తున్న సమయంలో కరీంనగర్లో ఓ ప్రయివేటు వాహనంలో మార్చామనీ, ఆ సమయంలో ఒకరు వీడియో తీసి సోషల్మీడియాలో వైరల్ చేశారన్నారు. ఈ విషయంలో ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు వారి ప్రతినిధులకు వివరించగా వారు సమ్మతం తెలిపారని రిటర్నింగ్ అధికారి వివరించారు. పోలింగ్లో వినియోగించిన బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లను ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కాలేజీలోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచామనీ, దీనిపై ఎటువంటి అపోహలూ, సందేహాలకు తావులేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారాలు నమ్మకూడదని ఆయన తెలిపారు.