Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రొఫెసర్ హరగోపాల్
నవతెలంగాణ-హిమాయత్నగర్
టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల మూసివేత పరంపర కొనసాగుతూ ఉందని ప్రొఫెసర్ హరగోపాల్ ఆరోపించారు.ఆదివారం హైద రాబాద్, హిమాయత్నగర్లోని బీసీ సాధికారత సంస్థ కార్యాలయంలో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..అయిదేండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం వేలాది సర్కార్ బడులను కరోనా సాకుతో మూసి వేస్తున్నారని ఆరోపించారు. వేల సంఖ్యలో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ వేయలేదనీ, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం చలించడం లేదని ఆరోపించారు. ఆన్లైన్ క్లాసుల పేరుతో విద్యార్థుల విద్యా భవిష్యత్ను అంధకారం చేశారన్నారు.టీచర్స్ సంఖ్యను కుదించి, స్కూల్స్ మూసివేతకు కుట్ర పన్నారని తెలిపారు.రాష్ట్రంలో ప్రయివేట్, కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేత కాకుండా,వాటిని బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రొఫెసర్ చక్రధర్, కార్యనిర్వాహక కార్యదర్శి ప్రొ.లక్ష్మీనారాయణ, డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రఘుశంకర్ రెడ్డి, టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రమణ, కార్యదర్శి మైసా శ్రీనివాస్, పీవైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్ ప్రదీప్, పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పరశురామ్, బి.రాము, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అనిల్, వేణుగోపాల్, మహేష్, ఎస్.నాగేశ్వర్రావు, నారాయణరెడ్డి పాల్గొన్నారు.