Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శబ్దాలతో పాటు ఇండ్లలో కిందపడ్డ వస్తువులు
- భయంతో రోడ్లపైకి పరుగులు తీసిన జనం
నవ తెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి/ హాజీపూర్
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం భూమి స్వల్పంగా కంపించింది. గోదావరి పరివాహక గ్రామాల్లో స్వల్ప భూప్రకంపనలు రావడం ఇది రెండో సారి కావడం ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఒక్కసారిగా కొన్ని వస్తువులు కింద పడడంతో జగి త్యాలలో కొందరు ప్రజలు బయటకు పరుగులు తీశారు. మంచిర్యాల, కొమురం భీం, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భూమి కంపించింది. సాయంత్రం 6.49గంటలకు 3సెకన్లపాటు భూమి కంపించింది. ఇండ్లలోని వస్తువులు ఒక్కసారిగా కిందపడటం, శబ్దాలు రావడంతో జనం ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ నెల 23 శనివారం మధ్యాహ్నం మంచిర్యాల జిల్లాలో భూకంపంతో ప్రజలు భయంతో వణికిపోయారు. ఇప్పటి వరకు ఎప్పు డూ ఎదురు కాని ఇలాంటి సంఘటనలు వరుసగా జరగడంతో ప్రజలు భయాం దోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే చిన్న భూకంపం కావడంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ భవిష్యత్తులో ఏంజరుగబోతుందోనని చర్చనీ యాంశంగా మారింది. మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు హాజీపూర్, లక్షెట్టిపేట్ మండలాల్లో, ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటల, బెజ్జూర్ మండలాల్లో, జగిత్యాల జిల్లా కేంద్రంలోని రహమత్పుర, పెద్దపల్లి జిల్లా రామగుండం, ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూరు, సలుగుపల్లి గ్రామాల్లో, మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోనూ భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు.