Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళలకు వృత్తి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి
- వెలుగులోకి పలు అంశాలు : ఐద్వా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహిళలకు వృత్తిశిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని అఖిల భారత ప్రజా తంత్ర మహిళాసంఘం (ఐద్వా) అధ్యక్ష, కార్యదర్శులు ఆర్అరుణజ్యోతి, మల్లు లక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తం గా వివిధ తరగతులమహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పైన సర్వే నిర్వహి స్తున్న నేపథ్యంలో..హైదరాబాద్లో ఉన్న బాగ్లింగంపల్లి లంబాడి బస్తీలో ఆదివారం సర్వేనిర్వహించినట్టు తెలిపారు. పలుఅంశాలు వెలుగులోకి వచ్చా యని పేర్కొన్నారు. బియ్యం, పప్పులు, కూరగాయల ధర లు, గ్యాస్ ధరలు పెంచడంవల్ల కుటుంబం గడవడం చాలాకష్టంగా తమజీవనాన్ని గడుపుతు న్నారని పేర్కొన్నారు. పిల్లలచదువులు, వారికి ఫీజులుకట్టలేక తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎల్కేజీ విద్యకు కూడా రూ.10,000 ఫీజు కట్టాల్సివస్తున్నట్టు తెలిసిందని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల ధర లుపెరగడం, మరో పక్క పిల్లల చదువులు మోయ లేని భారంగా మారడంతో వారు ఆందోళనకుగురవుతున్నారని తెలిపారు. డిగ్రీ,పీజీ చేసినా ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఎక్కువ శాతం ప్రజలకు పను లు లేవని మహిళలే కుటుంబ భారంమోస్తున్నారని పేర్కొన్నారు. తమ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి కుట్టుమిషన్లు ఇవ్వాలని, ఉపాధి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి ,వృత్తుల్లో ట్రైనింగ్ ఇచ్చి వారు తయారుచేసిన ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారి సమస్యల పరిష్కారం కోసం ఐద్వా ఆధ్వర్యంలో అధికారులకు వినతి పత్రాలు ఇస్తామనీ, పరిష్కారం కాకపోతే మహిళలను కూడగట్టి ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈసర్వేలో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శితోపాటు రాష్ట్ర నాయకురాలు యం. స్వర్ణలత, స్థానిక మహిళలు పాల్గొన్నారు.