Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో ప్రజాధనం లూటీ
- వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల
నవతెలంగాణ-చింతపల్లి
రాష్ట్రంలో ప్రజాధానాన్ని లూటీ చేస్తూ సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారనీ, ఒక్క హుజూరాబాద్ ఎన్నికల్లోనే రూ.1000 కోట్ల ప్రజా ధనాన్ని దుబారా చేశారని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ప్రజాప్రస్థాన పాదయాత్ర సోమవారం నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పోలేపల్లి, రాంనగర్, రోటిగడ్డతండా, ఎర్రమట్టితండా, చాకలి షేర్పల్లి, కుర్మేడు, గొల్లపల్లిలో కొనసాగింది. ఈ సందర్భంగా పలు చోట్ల నిర్వహించిన సభల్లో ఆమె మాట్లాడారు. నల్లగొండ జిల్లాలోని ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని మంజూరు చేసిన ఘనత వైఎస్ రాజశేఖర్రెడ్డికే దక్కుతుందన్నారు. సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమాన్ని విస్మరించి పాలన సాగిస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగులను మోసం చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా పనులు చేయడం సరికాదన్నారు.
ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారన్నారు. నల్లగొండ జిల్లా పూర్తిగా ఫ్లోరైడ్ ప్రాంతం అయినప్పటికీ ఏ ఒక్క వికలాం గుడికీ న్యాయం జరగకపోగా.. వారిని కేవలం ఆసరా పింఛన్కు మాత్రమే అలవాటు చేశారన్నారు. ఎంతో మంది పీజీలు, డిగ్రీలు చేసి ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న పాలన తిరిగి రావా లంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి సంపూర్ణ మద్దతునివ్వాలని కోరారు. పాద యాత్రలో ఆ పార్టీ నాయకులు పిట్ట రాంరెడ్డి, ప్రముఖ గాయకులు ఏపూరి సోమన్న, కళ్యాణ్నాయక్, సిరాజ్, బెదరకోట భాస్కర్, సిద్దగోని నవీన్, రంగా రెడ్డి జిల్లా కోకన్వీనర్ మెరుగు అజరు, పెండ్యాల సాయి వికాస్ పాల్గొన్నారు.