Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి రెండోవిడత కౌన్సెలింగ్ షెడ్యూల్ను ప్రకటించాలని తెలంగాణ స్కూల్, టెక్నికల్ కాలేజీల ఉద్యోగుల సంఘం (టీఎస్టీసీఈఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రికి సోమవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అయినేని సంతోష్కుమార్ వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ జాప్యం జరగలేదని గుర్తు చేశారు. కానీ ఈ ఏడాది జాప్యం జరగడం వల్ల విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయే అవకాశముందని తెలిపారు. ఇంకోవైపు ప్రయివేటు విశ్వవిద్యాలయాల్లో చేరే ప్రమాదముందని వివరించారు. పేద, మధ్య తరగతి విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. కౌన్సెలింగ్ పూర్తి చేయకపోవడం, తరగతులను ప్రారంభించకపోవడం వల్ల విద్యార్థులు నష్టపోతారని తెలిపారు. ఇతర వర్సిటీల్లో ఇప్పటికే ఇంజినీరింగ్ విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు.