Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం ఉద్యమాన్ని ఉధృతం చేయాలని తెలంగాణ విద్యాపరిరక్షణ సమితి విస్తృత కార్యవర్గం తీర్మానించింది. తీ మేరకు సమితి అధ్యక్షులు చక్రధర్రావు, ప్రధాన కార్యదర్శి హరగోపాల్, కార్యనిర్వాహక కార్యదర్శి లక్ష్మినారాయణ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యారంగానికి బడ్జెట్లో కేటాయింపులు పెంచాలనీ, పాఠశాలల మూసివేత ఆపాలని కోరారు. ఉపాధ్యాయ, అధ్యాపక నియామకాలు జరపాలని సూచించారు.