Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిలోఫర్ జూడాల వార్నింగ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రోగుల బంధువుల విమర్శలు, దాడులు షరామామూ లుగా మారిన క్రమంలో తాము విధులు నిర్వహించలేమని నిలోఫర్ ఆస్పత్రి జూనియర్ డాక్టర్లు తేల్చి చెప్పారు. ఆదివారం బాలుడి మరణం, ఆ వరసలోనే అత్యాచారానికి గురైన బాలికను చేర్చుకుని చికిత్స చేయాలంటూ తెలంగాణ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన, ఆస్పత్రిలో చోటు చేసుకుంటున్న సంఘటనల నేపథ్యంలో సూపరింటెండెంట్ ఎదుట జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు.ఆస్పత్రిలో పాలనాప రమైన లోపాల కారణంగా తాము వైద్యంలో నిర్లక్ష్యం చేశామనే నింద మోయాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.