Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణకు విమోచన కేవలం సర్దార్ వల్లభారుపటేల్ వల్లే జరిగిందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ నాయకకులు చేసిన వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. నిజాం నవాబు ధనవంతుడు, బలవంతుడు, సైన్యం అన్ని హంగులతో ఉన్నా ఆయన మూలాలను, యంత్రాంగాన్ని కదలించి అంతా తలకిందులు చేసింది, భూస్వామ్య వ్యవస్థను బద్దలు కొట్టింది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కిషన్రెడ్డి చేసిన ప్రకటన త్యాగధనుల త్యాగాలను అవమానపరిచేలా ఉన్నాయని విమర్శించారు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు గోబెల్స్ ప్రచారం మానుకోవాలని సూచించారు.