Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణా తొలితరం నవలా సాహిత్యకారుడు వట్టికోట ఆళ్వారుస్వామి స్పూర్తి రాష్ట్రసాధన కోసం సాగిన సాహిత్య, సాంస్కృతిక ఉద్యమంలో కీలక భూమికను పోషించిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. వట్టికోట జయంతి సందర్భంగా సీఎం ఆయన సాహిత్య సేవలను స్మరించుకున్నారు. పాత్రికేయుడుగా, కథకుడుగా, నవలాకారు డుగా, తెలంగాణ సాయుధ పోరాట కాలంలో తన సాహిత్యంతో ప్రజల్లో చైతన్యాన్ని రగిలించిన వట్టికోట సాహిత్య కృషి అజరామరం అని తెలిపారు.
ప్రహ్లాద్ మరణం పట్ల సీఎం సంతాపం
తెలంగాణ ఉద్యమ గాయకుడు సాదినేని (జంగ్) ప్రహ్లాద్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలో గాయకుడి గా ప్రహ్లాద్ సాంస్కృతిక కృషిని సీఎం కేసిఆర్ స్మరించుకు న్నారు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతిని తెలిపారు.