Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తల్లిదండ్రులు, గిరిజన సంఘాల ఆందోళన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
లైంగికదాడికి గురైన బాలికను నిలోఫర్ ఆస్పత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించడంతో ఆ బాలిక తల్లిదండ్రులతో కలిసి గిరిజన సంఘాలు ఆందోళన నిర్వహించాయి.సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకున్న ఘటనతో ఆయా సంఘాల నాయకులు బాధితురాలి తల్లిదండ్రులను పరామర్శించి సిరిసిల్లలో వైద్యం ఇప్పించేందుకు ప్రయత్నించారు. సాధ్యం కాకపోవటంతో ఆ బాలికను నిలోఫర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడా తిరస్కారమే ఎదురు కావటంతో ఆమె తల్లిదండ్రులతో కలిసి దీంతో వారు సోమవారం ఆందోళన నిర్వహించారు.దీంతో వైద్యులు..ఆ బాలికను ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్సనందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.ధర్మ నాయక్,ఆర్ శ్రీరామ్ నాయక్. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ నాయకులు బెల్లయ్య నాయక్,లైవ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్. రాజ్ కుమార్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర సర్కార్ విఫలం...కేటీఆర్ది బాధ్యతారాహిత్యం
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లైంగికదాడి ఘటన జరిగి వారం రోజులవుతున్నా మెరుగైన వైద్యం అందించడంలోనూ, వారి కుటుంబాన్ని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య మనోవేదన పడుతున్న చిన్నారికి వైద్యం అందించకుండా బలవంతంగా ఆదివారం సాయంత్రం డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపారని విమర్శించారు. చిన్నారికి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో హుటాహుటిన తల్లిదండ్రులే రాత్రి 2:30 గంటలకు హైదరాబాద్లోని నిలోఫర్ హాస్పిటల్కు తీసుకొచ్చారనీ, అయినా ఆ చిన్నారిని ఉదయం ఏడు గంటల వరకు చేర్చుకోకుండా వరండాలోనే పడుకో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన సంఘటనను కప్పిపుచ్చుకోవడానికీ, లైంగికదాడికి పాల్పడ్డ టిఆర్ఎస్ సర్పంచ్ భర్త ను కాపాడేందుకూ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే విధంగా సంఘటన జరిగిన ఇంత వరకు సిరి కుటుంబాన్ని మంత్రి కేటీఆర్ పరామర్శించకపోవడం బాధ్యతారాహిత్యం అని అన్నారు. గిరిజన శాఖ మంత్రి ఒక మహిళే అయినా ఒక గిరిజన బాలికపై అత్యాచారం జరిగితే కనీసం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లో చిన్నారులపై లైంగికదాడులు, అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నా వాటిని నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లైంగిక దాడికికి పాల్పడిన కామాంధుడిని కేవలం అరెస్టు చేసే సరి పుచ్చుకోవడం కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠిన శిక్ష పడే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.,ఆ బాలిక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేకపోతే అన్ని గిరిజన సంఘాలు ,ప్రజా సంఘాలను కలుపుకుని ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని, రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పూనుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.