Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగిసిన ప్రధాన పరీక్షలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జరుగుతున్న ప్రథమ సంవత్సరం విద్యార్థుల ప్రధాన సబ్జెక్టులకు చెందిన పరీక్షలు సోమవారం ముగిశాయి. కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1కు 4,25,580 మంది దరఖాస్తు చేయగా, 4,00,990 (94.3 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ఒక ప్రకటనలో తెలిపారు. 24,590 (5.7 శాతం) మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి, వికారాబాద్, రంగారెడ్డి, జనగామ జిల్లాల్లోని వివిధ పరీక్షా కేంద్రాలకు పరిశీలకులను పంపించామని వివరించారు. మంగళవారం చివరిరోజు ఒకేషనల్ సబ్జెక్టులకు రాతపరీక్షలు జరుగుతాయి. గతనెల 25 నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈనెల 6 నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమవుతుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను ఇంటర్ పరీక్షల నియంత్రణాధికా రి అబ్దుల్ ఖాలిక్ ప్రకటించారు. మొదటి దశ మూల్యాంకనం ఈనెల 6 నుంచి, రెండో దశ మూల్యాంకనం ఈనెల 8 నుంచి ప్రారంభమవుతుందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 13 మూల్యాంకనం కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపా రు. కొత్తగా సిద్ధిపేటలోనూ మూల్యాంకనం కేంద్రం అందు బాటులో ఉంచామని పేర్కొన్నారు. మొదటి దశలో అరబిక్, ఫ్రెంచ్,మరాఠి, ఉర్దూ, మ్యాథ్స్, పొలిటికల్ సైన్స్, బాటనీ సబ్జెక్టుల మూల్యాంకనం జరుగుతుందని వివరిం చారు. రెండోదశలో జువాలజీ, ఫిజిక్స్, ఎకనామిక్స్, హిస్టరీ, కెమిస్ట్రీ, కామర్స్, జాగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జీ కోర్సు సబ్జెక్టులకు మూల్యాంకనం చేపట్టాలని నిర్ణయించామని పేర్కొన్నారు.