Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కెఆర్ఎంబీ) సబ్కమిటీ సభ్యుడిగా తెలంగాణ అధికారి శ్రీధర్రావు దేశ్పాండే నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను కెఆర్ఎంబీ ఆమోదించింది. రాష్ట్ర ప్రభుత్వానికి, సాగునీటి శాఖకు సోమవారం కెఆర్ఎంబీ నుంచి లేఖ అందింది. శ్రీధర్రావు దేశ్పాండే ప్రస్తుతం సాగునీటి శాఖలో ఇన్చార్జి సీఈగా కొనసాగుతున్నారు. వి.మోహన్కుమార్ స్థానంలో దేశ్పాండేను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. శ్రీధర్రావుతోపాటు టిఎస్జెన్కో సీఈ ఒకరు ఇప్పటికే కెఆర్ఎంబీ సబ్కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.