Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాశిబుగ్గ
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తికి రికార్డు ధర పలికింది గతంలో ఎప్పుడూ లేనివిధంగా క్వింటా పత్తికి రికార్డు స్థాయిలో రూ.8500 ధర పలికింది. జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం ఉప్పుగల్లు గ్రామానికి చెందిన కొమురయ్య అనే రైతు మార్కెట్కు పత్తిని తీసుకురాగా, శ్రీజ ట్రేడర్స్ అడ్తి ద్వారా విశ్వనాధ్ ట్రేడింగ్ ఖరీదుదారు అత్యధిక ధర (క్వింటాకు రూ.8500) చెల్లించి కొనుగోలు చేశారు. కాగా సోమవారం వరంగల్ వ్యవసాయ మార్కెట్కు దాదాపు 15వేల బస్తాల పత్తి వచ్చింది. క్వింటా పత్తికి గరిష్టంగా ధర రూ.8500 పలుకగా కనిష్టంగా రూ.7100పలికింది.