Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు, ఆర్థిక మంత్రి హరీశ్రావు హామీ ప్రకారం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)లో పనిచేస్తున్న ఉపాధ్యా యులు, ఉద్యోగులకు పీఆర్సీ వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని రెగ్యులర్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్లతోపాటు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వారందరికీ పీఆర్సీ వర్తింపచేస్తామని ఈ ఏడాది మార్చి 22న సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారని గుర్తు చేశారు. కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్రశిక్ష, నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు పీఆర్సీ ఉత్తర్వులు ఇవ్వలేదని గతనెల 7న శాసనమండలిలో తాను ప్రస్తావించానని తెలిపారు. దీనిపై ఆర్థిక మంత్రి హరీశ్రావు వారం, పది రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కానీ ఇంతవరకూ ఉత్తర్వులు జారీ చేయకపోవడం వల్ల ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారని వివరించారు. వెంటనే పీఆర్సీ ఉత్తర్వులను జారీ చేయాలని కోరారు.