Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దీక్షా దివస్రోజున సభ పెట్టాలనే డిమాండ్తోనే మార్పు : నిర్ణయాన్ని ప్రకటించిన సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
టీఆర్ఎస్ పార్టీ వరంగల్లో ఈ నెల 15న తలపెట్టిన తెలంగాణ విజయ గర్జన సభను దీక్షా దివస్ రోజైన 29వ తేదీన నిర్వహించనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సభ విజ యవంతానికి కమిటీలు వేసుకుని ఏర్పాట్లల్లో నిమగమైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆయా జిల్లాల టీఆర్ఎస్ నేతలు ఈ విషయాన్ని గమనించా లని కోరారు. ఇప్పటికే చేసుకున్న ఏర్పాట్లను, బస్సులు తదితర రవాణా వ్యవస్థలను 29వ తేదీకి మార్చుకోవాలని సూచించారు. తేదీ మార్పు విషయాన్ని క్షేత్రస్థాయి కార్యకర్తలకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ వినరు భాస్కర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ మంత్రి కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, వరంగల్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, ఆరూరి రమేశ్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ధర్మారెడ్డి తదితర పార్టీ ముఖ్యనేతలు వరంగల్ సమావేశంలో ముక్త కంఠంతో చేసిన అభ్యర్థన మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలిపారు. తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడి స్వరాష్ట్ర సాధనకు మూలమైన ధీక్షా దివస్ రోజే విజయగర్జన సభను 29వ తేదీనే నిర్వహించాలని నిర్ణయించారు.