Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 6 నుంచి ధ్రువపత్రాల పరిశీలన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2021-22 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఐసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ షెడ్యూల్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బుధవారం నుంచి ఈనెల 9 వరకు ఆన్లైన్లో ప్రాథమిక సమాచారం అందుబాటులో ఉంటుందనీ, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలనీ, హెల్ప్లైన్ కేంద్రాల వివరాలుంటాయని తెలిపారు. అదేనెల 6 నుంచి 10 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని వివరించారు. ఈనెల 6 నుంచి 11 వరకు వెబ్ఆప్షన్లు నమోదు చేసేందుకు అవకాశముందని పేర్కొన్నారు. అదేనెల 14న సీట్లు కేటాయిస్తామని వివరించారు. ఇతర వివరాలను ష్ట్ర్్జూర://్రఱషవ్.అఱష.ఱఅ వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.