Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు ఈటల రాజేందర్దే తప్ప బీజేపీది కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి తెలిపారు. ఈటల వ్యక్తిత్వం, ప్రజల్లో ఉన్న సానుభూతే ఆయనను గెలిపించాయని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో గూడుకట్టుకున్న వ్యతిరేకత వల్లే ఈటలకు సానుభూతి పెరిగిందని తెలిపారు. టీఆర్ఎస్, బీజేపీ ఇరు పార్టీలు కనీవినీ ఎరుగని రీతిలో ఈ ఎన్నికల్లో డబ్బు పంచాయని వివరించారు. అధికార పార్టీ ఇప్పటికైనా ఈ ఎన్నికలను గుణపాఠంగా తీసుకుని ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన సాగించాలని సూచించారు. ఎన్నికల సంస్కరణలు తెచ్చి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే బాధ్యత కేంద్ర పాలకులపై ఉందని తెలిపారు.