Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వరిధాన్యం కొనుగోళ్ళను వెంటనే చేపట్టాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ధాన్యం ఇదే డిమాండ్పై కొనుగోళ్శను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ...9న గ్రామస్థాయిలో, 12న జిల్లా కలెక్టరేట్ల ముందు ప్రజాసంఘాలతో కలిసి ఆందోళనలు నిర్వహించాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ ఒక ప్రకటనలోరైతులకు పిలుపునిచ్చారు. ఇప్పటికే వానాకాలం వరి ధాన్యం మార్కెట్కు వస్తున్నదనీ, అక్కడి అధికారులు తేమ శాతాన్ని చూపి కొనుగోలును నిరాకరిస్తున్నారని పేర్కొన్నారు. చాలా చోట్ల ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఇంకా ప్రారంభించలేదని తెలిపారు.ప్రభుత్వం ధాన్యంలో తేమను 17 శాతంగా నిర్ణయించిందని గుర్తుచేశారు. అంత కంటే తక్కువ తేమ ఉన్న ధాన్యాన్ని కూడా మిల్లర్లు కొనుగోలు చేయడం లేదని పేర్కొన్నారు. క్వింటాలుకు 5 నుంచి 10 కిలోల వరకు తరుగు కింద తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.