Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీజీపీ కార్యాలయంలో ప్రారంభించిన డీజీపీ మహేందర్రెడ్డి
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో నేరాలను కట్టడి చేయడమే గాక, నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవనే సంకేతాలను పంపించడంపై పోలీసులు దృష్టి సారించాలని రాష్ట్ర డీజీపీ ఎం.మమేందర్రెడ్డి అన్నారు. మంగళవారం డీజీపీ కార్యాలయంలో షీ, భరోసా ల్యాబ్, ఎన్ఆర్ఐ కేస్ సెల్, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ సెల్, మిస్సింగ్ చిల్ట్రన్స్ సెల్లను డీజీపీ ప్రారంభించారు. వాటికి సంబంధించిన నాలుగు పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు రాష్ట్రంలో అన్నిరకాల నేరాలను అరికట్టడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళల భద్రతపై సర్కారు ప్రత్యేకంగా దృష్టిని సారించిందని తెలిపారు.
అందులో భాగంగానే మహిళా భద్రతా విభాగం, షీటీమ్స్ వంటి ప్రత్యేక విభాగాలను ఏర్పాటుచేసి మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో నేరాల అదుపుకు సీసీ కెమెరాల ఏర్పాటుచేయటం వలన దాదాపు 58శాతం నేరాల్లో దోషులకు శిక్షలుపడేలా చేయగలి గామన్నారు. నగర సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతికపరిజ్ఞానంతో నేరాలను అరికట్టే విషయంలో చాలావరకు ఫలితా లను సాధిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా మహి ళల భద్రతలో ఈ విధానం ఎంతగానో త్పోడుతు న్నదని తెలిపారు. రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ స్వాతి లక్రా మాట్లాడుతు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటుచేసిన 331 షీటీమ్లతో మహి ళల రక్షణకు తీవ్రంగా కృషి సాగిస్తున్నామ న్నారు. దీని వలన నేరాలు కూడా తగ్గుముఖం పట్టాయన్నారు. ఈ కార్యక్రమానికి సైబరాబాద్, రాచకొండ సీపీలు స్టీఫెన్ రవీంద్ర, మహేష్ భగవత్ తదితర ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.