Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సిరిసిల్ల జిల్లాలో గత నెల 27న లైంగికదాడికి గురై నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరేండ్ల చిన్నారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ మంగళవారం పరామర్శించారు. మాజీ ఎంపీ రవీంద్రనాయక్ కలిసి కుటుంబ సభ్యులను ఓదార్చారు. చిన్నారికి మెరుగైన చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నిందితుడైన టీఆర్ఎస్ నాయకుణ్ని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరేండ్ల చిన్నారిపై జరిగిన లైంగికదాడిని చిన్న ఘటనగా చిత్రీకరించేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. ఆ పాపకు ట్రీట్ మెంట్ చేయొద్దు...ఇంటికి పంపాలని సీఎంఓ నుంచి ఒత్తిళ్లు చేయడం దుర్మార్గమన్నారు. టీఆర్ఎస్ నేతలు లైసెన్స్ గూండాలుగా మారారని ఆరోపించారు. న్యాయం జరిగే వరకూ చిన్నారి కుటుంబానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు.