Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వీఐటీ ఏపీ విశ్వ విద్యాలయం ప్రాంగణ ఎంపికలు సాధించిన విద్యార్థులను శనివారం విజయవాడలోని తాజ్ గేట్వే హౌటల్లో ముఖ్య అతిథి కృష్ణ జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ జె. నివాస్ సమక్షంలో సత్కరించారు. ముఖ్య అతిథి జె. నివాస్, కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ మాట్లాడుతూ ఈ సన్మాన కార్యక్రమంలో భాగమైనందుకు ఆనందంగా ఉందని నాణ్యమైన విద్యకు చిరునామా వీఐటీ -ఏపి విశ్వ విద్యాలయం అని తెలిపారు. అతి తక్కువ సమయంలో ఇటువంటి ప్రాంగణ ఎంపికలు సాధించడం గర్వకారణమని కొనియాడారు. ఉపాధి కల్పించిన సంస్థలో నిజాయితీ, నిబద్దతతో పనిచేసి సంస్థ అభివృద్ధిలో భాగం కావాలని తెలియచేశారు. వైస్ ఛాన్సలర్ డా|| ఎస్.వి కోట రెడ్డి మాట్లాడుతూ ''దేశంలోని అగ్రశ్రేణి కంపెనీలు మరియు ఎంఎన్సీల్లో మా విద్యార్థులు ఉద్యోగాలు సాధించటం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. విద్యార్థుల నిరంతర కృషి మరియు విశ్వవిద్యాలయం అందించే నాణ్యమైన విద్య వల్లే ఈ ఫలితాలు సాధించామని తెలియచేసారు. రాబోయే సంవత్సరాల్లో బలమైన పారిశ్రామిక బంధాన్ని కొనసాగిస్తూ ప్రపంచానికి బాధ్యతాయుతమైన నాయకులను అందించటమే లక్ష్యం ముందుకు సాగుతామని అన్నారు.