Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా 167 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. సోమవారం సాయం త్రం 5.30 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు 37,941 మందికి టెస్టులు చేసినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. ప్రభుత్వాస్పత్రుల్లో 33,509 మందికి, ప్రయివేటు ఆస్పత్రుల్లో 4,432 మందికి పరీక్షలు నిర్వహించారు. మరో 1,031 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,933 యాక్టివ్ కేసులున్నాయి. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 66 మందికి కరోనా సోకింది. అతి తక్కువగా ఏడు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఈ వ్యాధి బారిన పడ్డారు. మరో ఆరు జిల్లాల్లో ఒక్క కేసు నమోదు కాలేదు.
15 జిల్లాల్లో పెరిగిన కేసులు
14 జిల్లాల్లో తగ్గిన కేసులు
ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్ - మల్కాజిగిరి, ములుగు, నాగర్ కర్నూల్, నిజామాబాద్, సిద్ధిపేట, వనపర్తి, వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తక్కువగా నమోదయ్యాయి.
ఆ జిల్లాల్లో జీరో.....
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వారం రోజులుగా, నిర్మల్ జిల్లాలో నాలుగు రోజులుగా, నారాయణపేట జిల్లాలో రెండు రోజులుగా ఒక్క కేసు నమోదు కాలేదు. వికారాబాద్ జిల్లాలో రెండు రోజులుగా కేసుల్లో ఎలాంటి మార్పు లేదు.