Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంబురాలు
- అమరవీరుల స్థూపం వద్ద నివాళి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ట్రిపుల్ ఆర్(రాజాసింగ్, రఘునందన్రావు, రాజేందర్)తో సీఎం కేసీఆర్కు ఇక చుక్కలేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ అన్నారు. ఈటల రాజేందర్ గెలుపుతో హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం గెలుపు సంబురాలను నిర్వహించారు. ఉదయం నుంచి రాష్ట్ర నాయకత్వమంతా రాష్ట్ర కార్యాలయంలోనే ఉండి హుజురాబాద్ ఫలితాలను టీవీఛానళ్లలో వీక్షించారు. 15 రౌండ్ల ఫలితాల ప్రకటన తర్వాత ఈటల గెలుపు ఖాయమని నిర్ధారణ కావడంతో పెద్దఎత్తున టపాసులను కాల్చారు. స్వీట్లను పంచారు. ఈ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ను బీజేపీ కార్యకర్తలు ఎత్తుకుని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అధికార పార్టీ టీఆర్ఎస్ ఎన్ని కుతంత్రాలకు పాల్పడినా, ఎన్ని డబ్బులు పంచినా ప్రజలు ఈటలనే ఆదరించారన్నారు. ప్రజల మనసులకు చేరువై ఓట్లు పొందొచ్చుగానీ, తాయిలాలు, డబ్బులతో గెలువలేరని హుజూరాబాద్ ప్రజలు టీఆర్ఎస్కు తేల్చిచెప్పారన్నారు. తప్పుడు పద్ధతుల్లో గెలవలేమనే విషయాన్ని టీఆర్ఎస్ గుర్తించుకోవాలన్నారు.