Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిప్యూటీ తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్ కూడా..
- భూ వివాదంలో తలదూర్చినందుకే..
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల తహసీల్దార్ గిరిధర్ సస్పెండ్ అయ్యారు. భూ వివాదంలో తలదూర్చినందుకు ఆయన్ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. చౌటుప్పల్ మండలంలోని ఓ భూ రిజిస్ట్రేషన్ విషయంలో తహసీల్దార్ జోక్యం చేసుకున్నారు. ఇదే విషయంలో తహసీల్దార్ గిరిధర్తో పాటు డిప్యూటీ తహసీల్దార్ మమత, సీనియర్ అసిస్టెంట్ జానయ్యను కూడా సస్పెండ్ చేశారు. కొంతకాలంగా తహసీల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిన నేపథ్యంలో రెవెన్యూ అధికారుల సస్పెన్షన్ చర్చనీయాంశంగా మారింది.