Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓపెన్ కేటగిరీలో టాప్టెన్లో 3 ర్యాంకులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) యూజీ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థులు ఆధిపత్యం ప్రదర్శించారు. 720కి 715 సమాన మార్కులతో ముగ్గురు విద్యార్థులు అఖిల భారత స్థాయిలో ఓపెన్ కేటగిరీలో టాప్టెన్లో మూడు ర్యాంకులు సాధించారు. మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత బీఎస్ రావు, అకడమిక్ డైరెక్టర్, ఇన్ఫినిటీ లెర్న్ ఫౌండర్ డైరెక్టర్ సుష్మ మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన నీట్ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థులు తెలుగువారి కీర్తి పతాకాన్ని జాతీయ స్థాయిలో రెపరెపలాడించారని చెప్పారు. ఈ ఏడాదీ టాప్ ర్యాంకుల్లోనూ, అర్హత సాధించిన వారిలోనూ తిరుగులేని అగ్రస్థానంలో ఉన్నారని వివరించారు. ఓపెన్ కేటగిరీలో ఖండవల్లి శశాంక్, గొర్రిపాటి రుషిల్, సుయూష్ అరోరా ఐదో ర్యాంకు సాధించారని అన్నారు. టాప్ 100లోపు 21 ర్యాంకులు వచ్చాయని చెప్పారు. అన్ని కేటగిరీల్లో టాప్టెన్లో ఎనిమిది ర్యాంకులు, 100లోపు 77 ర్యాంకులు తమ విద్యార్థులు సంపాదించారని వివరించారు. విజయం సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు, సిబ్బందిని అభినందించారు.