Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి నిరంజన్రెడ్డి ఆదేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన పత్తి పండుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చెప్పారు.అందుకే మన పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 35 వేల ఎకరాల్లో పత్తి విత్తనోత్పత్తి జరుగుతున్నదని తెలిపారు.ఆయా రైతులు నష్టం పోకుండా, వివిధ సమస్యల ఫలితంగా విత్తన కంపెనీలు రాష్ట్రం నుంచి తరలిపోకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం హైదరాబాద్లోని తన నివాసంలో అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రకాల విత్తనోత్పత్తికి తెలంగాణ ప్రాంతంలో అనుకూలమైన వాతావరణం ఉందన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కష్ణమోహన్రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, విత్తన కంపెనీల ప్రతినిధులు, విత్తనోత్పత్తి రైతులు ఉన్నారు.