Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
టీఆర్ఎస్ పార్టీ 20 ఏండ్లలో అనేక ఎత్తుపల్లాలను చూసిందనీ, హుజురాబాద్ ఫలితమేమీ పెద్ద ప్రభావం చూపదని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కె.తారకరామారావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కోసం పనిచేసిన మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్,గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులు, పార్టీ శ్రేణులకు,సోషల్మీడియా వారియర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో స్ఫూర్తివంతమైన పోటీ ఇచ్చిన పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్కు అభినందనలు తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా మరింత నిబద్ధతతో పని చేసేందుకు నిర్ణయం తీసుకొని, భవిష్యత్తులో రాబోయే సవాళ్లను ఎదుర్కొనేందుకు ముందుకు పయనించాలని కోరారు.