Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైఎస్ఆర్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల
నవతెలంగాణ-చింతపల్లి
హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఓటమితోనే టీఆర్ఎస్ పతకం మొదలైందని, ఈ ఓటమి గుణపాఠమని వైఎస్ఆర్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్.షర్మిల అన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం కురుమేడు గ్రామంలో నిరుద్యోగ నిరాహారదీక్ష చేపట్టారు. అంతకు ముందు మహాప్రస్థానం పాదయాత్రలో భాగంగా మండలంలో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత చదువులు అభ్యసించిన నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల ఆత్మహత్యలకు సీఎం కేసీఆర్ అవలంబిస్తున్న విధానాలే కారణమని విమర్శించారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ మేల్కొని నోటిఫికేషన్లు విడుదల చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని కోరారు. మాజీ సీఎం వైఎస్ఆర్ తన హయాంలో ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ టీపీ రాష్ట్ర అధికారప్రతినిధి పిట్ట రాంరెడ్డి, పెదరకోట భాస్కర్, భరత్రెడ్డి, కల్యాణ్నాయక్, ఏపూరి సోమన్న, వేణుగోపాల్రెడ్డి, సిద్ధగోని నవీన్గౌడ్, వెంకటేష్, శ్రీనివాస్, గణేష్, జహంగీర్ పాల్గొన్నారు.