Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8న ధ్రువపత్రాల పరిశీలన
- 9 వరకు వెబ్ఆప్షన్ల నమోదు
- 12న సీట్ల కేటాయింపు : షెడ్యూల్ విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు సంబంధిం చిన తుదివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 6 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ మంగళవారం షెడ్యూల్ను విడుదల చేశారు. తొలివిడతలో సీట్లు కేటాయించిన అభ్యర్థులు ఆన్లైన్లో సీట్లు రద్దు చేసుకునేందుకు ఈనెల 5 వరకు గడువుందని తెలిపారు. ఈనెల 6,7 తేదీల్లో ఆన్లైన్లో ప్రాథమిక సమాచారం అందుబాటులో ఉంటుందనీ, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలనీ, హెల్ప్లైన్ సెంటర్లకు వెళ్లేందుకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. అదేనెల 8న ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని వివరించారు. ఈనెల 6 నుంచి 9 వరకు వెబ్ఆప్షన్ల నమోదుకు అవకాశముంటుందని తెలిపారు. అదేనెల 12న సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. ఈనెల 12 నుంచి 15 వరకు ట్యూషన్ ఫీజు చెల్లింపు, ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని వివరించారు. 12 నుంచి 16 వరకు సీట్లు పొందిన అభ్యర్థులు ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు. తుదివిడతలో సీట్లు పొంది వాటిని రద్దు చేసుకునేందుకు ఈనెల 18 వరకు గడువుందని తెలిపారు. ఈ ఏడాది ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టబోతున్నట్టు వివరించారు. ఈనెల 20, 21 తేదీల్లో వెబ్ఆప్షన్లు నమోదు చేయాలని పేర్కొన్నారు. అదేనెల 24న సీట్లు కేటాయిస్తామని వివరించారు. ఈనెల 24 నుంచి 26 వరకు ట్యూషన్ ఫీజు చెల్లింపు, ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. అదేనెల 24 నుంచి 26 వరకు సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు. సీట్లను రద్దు చేసుకునేందుకు ఈనెల 26 వరకు గడువుందని పేర్కొన్నారు. స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను ఈనెల 25న జారీ చేస్తామని వివరించారు. ఇతర వివరాల కోసం ష్ట్ర్్జూర://్రవaఎషవ్.అఱష.ఱఅ వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు.