Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రమంతా ఉత్కంఠగా ఎదురుచూసిన హుజూరాబాద్ ఉప ఎన్నిక పోరులో ఈటల రాజేందర్ ఊహించని ఘన విజయం సాధించారు. అధికారపార్టీ దింపిన మంత్రులు,ఎమ్మెల్యేలు,భారీ సైన్యాన్ని ఎదిరించి.. ఆ పార్టీ ఎత్తులకు పైఎత్తులు వేస్తూ 23వేల 855 ఓట్ల మెజారీ ్టతో గెలుపు పతకాన్ని అందుకున్నారు. ఎన్నికల ఫలితాల లెక్కింపులో పోస్టల్బ్యాలెట్, ఈవీఎంల రెండు రౌండ్లు మినహా మిగిలిన 20 రౌండ్లలోనూ అధిక్యత చూపుతూ విన్నర్గా నిలిచారు.ఎన్నికల్లో కాషాయకండువా కప్పుకున్నా.. ఎక్కడా బీజేపీ అభ్యర్థిగా ప్రచారం చేసుకోని ఈటల.. ధైర్యాన్ని కోల్పోకుండా సొంత ఇమేజీ, ప్రజల్లో ఉన్న ఆదరణతో విజయాన్ని అందుకున్నారు. ఈ ఫలితాలు పార్టీ బ్యాక్ గ్రౌండ్ కాదు.. ప్రజానాయకుడికే ప్రజలు పట్టం కడతారని నిరూపించాయి.
8,11 రౌండ్లలో కాస్త వెనకబడినా..
పోస్టల్ బ్యాలెట్, 8, 11 రౌండ్లలో స్వల్ప తేడాతో వెనకబడిన ఈటల రాజేందర్ మిగిలిన రౌండ్లన్నింటిలోనూ స్పష్టమైన మెజార్టీ కనబరిచారు. తొలి రౌండ్ నుంచి 7 రౌండ్ల వరకు రాజేందర్ ఆధిపత్యం కొనసాగించగా.. 8వ రౌండ్లో మాత్రం టీఆర్ఎస్కు 162ఓట్ల ఆధిక్యం వచ్చింది. 11వ రౌండ్లో మళ్లీ టీఆర్ఎస్ ఆధిక్యం ప్రదర్శించగా.. 12వ రౌండ్ నుంచి ఈటల దూకుడు కొనసాగింది. పోస్టల్ బ్యాలెట్ సహా మొత్తం 22 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యే సరికి ఈటల రాజేందర్కు లక్ష 7వేల 22ఓట్లు రాగా.. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్కు 83వేల167 ఓట్లు దక్కాయి. మొత్తంగా 23వేల855 ఓట్లతో రాజేందర్కు సంపూర్ణ మెజార్టీ దక్కింది. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే రైతుబంధు, దళితబంధు వంటి పథకాలు ప్రారంభించిన శాలపల్లిలో ఈటల రాజేందర్ ఆధిపత్యం ప్రదర్శించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ సొంత గ్రామం హిమ్మత్నగర్లోనూ ఈటలకు ఆధిక్యం దక్కింది. ఇలా అన్ని మండలాల్లోనూ ఈటల పైచేయి సాధించారు.
కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు
పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ఎస్కు 455ఓట్ల ఆధిక్యతతో తొలుత కొంత ఊరట లభించింది.ఈటల రాజేందర్కు 242ఓట్లు మాత్రమే వచ్చాయి.హుజూరాబాద్ ఉప పోరులో కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయింది. అన్ని రౌండ్లలోనూ అరకొర ఓట్లతోనే సరిపెట్టుకుంది. మొత్తంగా ఆపార్టీ అభ్యర్థి బల్మూరి వెంకటనర్సింగరావుకు కనీసం ధరావతు కూడా దక్కలేదు.
భూకబ్జా ఆరోపణలతో పార్టీ వీడి..
టీఆర్ఎస్ పార్టీలో ఏడేండ్లు మంత్రిగా కొనసాగిన ఈటల రాజేందర్ ఆ పార్టీ అధిష్టానానికి, ఆయనకు మధ్య పొసగలేదు. పదవులు, అధికారం ప్రజలు పెట్టిన భిక్ష అంటూ పలుమార్లు బాహాటంగానే వ్యాఖ్యానించిన ఆయన ప్రభుత్వ పథకాల పట్ల సునిశిత విమర్శలు చేశారు. ధాన్యం కొనుగోళ్లలోనూ మిల్లర్లకు వార్నింగ్ ఇస్తూనే సర్కారు తీరుపట్ల పరోక్ష వ్యాఖ్యలూ చేశారు. టీఆర్ఎస్ పార్టీకి తామూ ఓనర్లేనంటూ ఓ సభలో మాటలతూటాలు వదిలారు. రైతుబంధు ధనికులకు ఎందుకంటూ ప్రశ్నిస్తూనే గొర్రెలు, బర్రెల పంపిణీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో రెవెన్యూ చట్ట సవరణలోనూ ఈటల లీకులు ఇచ్చి గందగోళం సృష్టించారన్న వార్తలు సహా గత ఎన్నికల్లో కొంత మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు నిధులు సమకూర్చాన్న ఆరోపణలు పార్టీ హైకమాండ్కు ఆగ్రహం తెప్పించింది. ఈ పరిణామాల మధ్యలో అకస్మాత్తుగా ఈటల రాజేందర్ భూకబ్జాలకు పాల్పడ్డారన్న వార్తలు..వెనువెంటనే ఆయనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం..అసైన్డ్ భూములు ఆక్రమించారంటూ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించడం చకచకా జరిగిపోయాయి. వీటన్నింటినీ ముందే అంచనా వేసిన ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అధికార పార్టీని ఢకొీట్టేందుకు సిద్ధమయ్యారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ శిబిరంలో చేరి కమలం గుర్తుపై పోటీకి దిగారు.
ఎక్కడా ధైర్యం కోల్పోకుండా..
రాజేందర్ రాజీనామా మర్నాడు నుంచే అధికార టీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా టీఆర్ఎస్ బలగాలను రంగంలోకి దింపింది. భూకబ్జా వ్యవహారం,అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలకు ఎక్కడా ధైర్యం కోల్పోకుండా ఈటల సమాధానం ఇస్తూ వచ్చారు.ఇన్నాళ్లూ టీఆర్ఎస్లో ప్రధాన ఫిల్లర్గా ఉన్న ఈటల ఆ పార్టీ ఎత్తులకుపైఎత్తులు వేస్తూ నియోజకవర్గ ంలో తనకంటూ జనబలాన్ని ఏర్పచుకుని అదే తన బలమని చెబుతూ వచ్చారు. అయితే ఆయన పేరుకు కాషాయకండు వా కప్పుకున్నా.. ఎక్కడా ఆ పార్టీ ఊసే ఎత్తకుండా తనకు జరిగిన అన్యాయం, ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అనే నినాదాలతోనే ముందుకు సాగారు. పదవికి రాజీనామా చేసిన మర్నాడు నుంచి నియోజకవర్గాన్నే అంటిపెట్టుకుని గడపగడపకూ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ప్రభుత్వ పాలనను ప్రశ్నించినందుకే అకారణంగా మంత్రిపదవి నుంచి తనను తొలగించి రాజకీయంగా దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారంటూ చేసిన ప్రచారంలో సఫలమయ్యారు.
ప్రజాతీర్పును శిరసావహిస్తాం :హరీశ్రావు
హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రజాతీర్పును శిరసావహిస్తాం.టీఆర్ఎస్కు ఓట్లేసిన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు ధన్యవాదాలు. టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేమీ తగ్గలేదు. దేశంలో ఎక్కడా లేనివిధంగా హుజూరాబాద్లో కాంగ్రెస్, బీజేపీ కలిసి పని చేశాయి.
ఈటల గెలుపు మాత్రమే.. :పొన్నం
గత ఎన్నికల్లో బీజేపీకి కేవలం 1600ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఈటల రాజేందర్ తాను ఎక్కడా బీజేపీ అభ్యర్థిని అని ప్రచారం చేసుకోలేదు. ప్రజల్లో తనకున్న ఆదరణ,అభిమానాన్ని స్మరించుకుంటూ వెళ్లి ప్రజల దీవెనలు పొందాడు. ఇది ముమ్మాటికీ ఈటల రాజేందర్ గెలుపు మాత్రమే. కేసీఆర్ అహంకారానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడా లని మాత్రమే ఓటర్లు తీర్పునిచ్చారు.
ఓటమితో బలహీనపడం టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి
'హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓటమికి పూర్తి బాధ్యత నేను తీసుకుంటా.ఈ ఎన్నిక ప్రత్యేక పరిస్థితుల్లో జరిగింది.మా పార్టీ భవిష్యత్ను ఈ ఎన్నికల ఫలితాలు ముమ్మాటికీ నిర్ధారించలేవు. బల్మూరి వెంకట్ భవిష్యత్లో రాష్ట్ర నాయకుడవుతారు. ప్రతి ఇంటి తలుపూ తట్టి కాంగ్రెస్ శ్రేణులు పార్టీ గళం వినిప ించారు. గెలిస్తే ఉప్పొంగేది లేదు. ఓడితే బలహీనమయ్యేది లేదు.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన చరిత్ర :ఈటల
''హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తాం.. ప్రజాస్వా మ్యాన్ని అపహాస్యం చేసిన చరిత్ర దేశంలో ఇదే. నియోజకవర్గంలో శ్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి వచ్చింది. రాబోయే కాలంలో ఇలాంటి సంప్రదా యం ఉండకూడదని కోరుకుంటున్నా. ఇంత వేదన, అక్రమాలు, దుర్మాగాలు ఎప్పుడూ చూడలే.. ఈ గెలుపు కేసీఆర్కు చెంపపెట్టు. కులాయుధాన్ని వాడే ప్రయత్నం చేశారు. డబ్బు సంచులు వెదజల్లినా హుజూరాబాద్ ప్రజలు నా వెంటే నడిచారు. నన్ను ఆదరించిన హుజూరాబాద్ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు.