Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీగా ఖర్చు పెట్టిందనీ, దళితబంధు అమలు చేసిందనీ, అయినా ఆ పార్టీ ఓడిపోవడంతో అధికార పార్టీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. మంగళవారం నవతెలంగాణ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ ఈ ఫలితాల నుంచి సీఎం కేసీఆర్ గుణపాఠం నేర్చుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నా, వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లు తెచ్చినా బీజేపీని విమర్శించలేదని అన్నారు. బీజేపీతో లోపాయికారిగా సత్సంబంధాలు కొనసాగించినందువల్లే ఈ ఫలితం వచ్చిందన్నారు. బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి ఈటల రాజేందర్ గెలిచినా అది ఆ పార్టీ బలం కాదని చెప్పారు. ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం వల్ల ప్రజల్లో సానుభూతి పెరిగిందని వివరించారు. ఆయనకు వ్యక్తిగతంగా మంచిపేరుందని అన్నారు. అందుకే దీన్ని ఈటల గెలుపుగానే చూడాలి తప్ప బీజేపీ గెలుపు కాదన్నారు. ఈ ఫలితాల నుంచి అన్ని రాజకీయ పార్టీలూ పాఠాలు నేర్చుకోవాలని కోరారు.